మారేడ్పల్లి : స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశ భక్తుడు అని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించు కొని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటలు మరువలేనివని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన యువ శక్తిని ప్రేరేపించి ఆంగ్లేయులను పారదోలేందుకు వేలాది మందితో ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించా రన్నారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి..నేను మీకు స్వాతంత్ర్యం తీసుకొని వస్తానని గట్టిగా చెప్పిన నాయకుడు
సుభాష్ చంద్రబోస్ అని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, నాయకులు ఆకుల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.