ఎర్రగడ్డ, నవంబర్ 16: బోరబండ డివిజన్ పెద్దమ్మనగర్లోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాలబాలికలు తెలంగాణ సంప్రదాయాలు కళ్లకు కట్టే విధంగా లఘు నాటికను ప్రదర్శించగా చప్పట్లతో పాఠశాల ఆవరణ మార్మోగింది. చిన్నారులు తమ ఆటపాటలతో అలరింపజేశారు. జానపద గేయాలకు అనుగుణంగా వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయుడు యాదగిరి మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేలా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలైన బాలబాలికలకు యాదగిరి బహుమతులను అందజేశారు. నాట్కో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విన్నర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ..
ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్నగర్కు చెందిన విన్నర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు రెండు రోజులుగా పలు క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలైన చిన్నారులకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, సనత్నగర్ ఆధ్వర్యంలో మంగళవారం బహుమతుల ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సైనికాధికారి డాక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ భిక్షపతి క్రీడల్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులు, కోచ్ అనిల్ తయప్పలను అభినందించారు. క్రీడలతో పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి, పట్టుదల, మానసికోల్లాసం కలుగుతుందని భిక్షపతి అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కళ్లెం శ్రీనివాస్రెడ్డి, ప్రతినిధులు విద్యానంద్, రవీంద్రనాథ్, మురళీకృష్ణ, తిరుపతిరెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.