నేరేడ్మెట్, ఫిబ్రవరి 1 : సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి అన్నారు. బుధవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, మల్కాజిగిరి డీసీపీ జానకీ ధరావత్ ఆదేశాల మేరకు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి, సాయినాథ్పురంలోని ఎస్ఆర్ డీజీ స్కూల్ లో సైబర్ జాగ్రుకా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించకూ డదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్ఫ్రీ నం బర్కు డయల్ చేయాలన్నారు.
సైబర్ క్రైమ్కు గురైన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నా యన్నారు. ఇంటర్నెట్ను పరిమితికిమించి వాడకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారన్నారు.
ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని, తెలియని మెసేజ్లపై క్లిక్ చేయరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయ మాటలు చెప్తూ బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, లోన్లు ఇస్తామని , ఇతరత్రా ఆశచూపి ఆన్లైన్ ద్వారా డబ్బులకు ఎర వేస్తారని, అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్లకు స్పందించ రాదని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడ్మెట్ ఎస్సై సంతోశ్ కుమార్, సైబర్ క్రైం సిబ్బంది కాంతయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ సరోజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.