అమీర్పేట్, జనవరి 23 : ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీశ్కు ఆహ్వానం అందింది. తాను సేకరించిన పుస్తకాల ద్వారా చక్కటి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన విద్యార్థిని ఆకర్షణను ప్రధాని మోదీ ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ నుంచి ఆకర్షణకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇలా ప్రత్యేక ఆహ్వానం అందుకున్న వారు కర్తవ్యపథ్ నుంచి వేడుకలను ప్రత్యక్షంగా తిలకిస్తారు. గణతంత్ర వేడుకలకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందడంపై ఆకర్షణ సతీశ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.