శేరిలింగంపల్లి, మే 19: ల్యాప్టాప్ దొంగిలించాడనే ఆరోపణలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ సౌత్ 24 పరగణాస్ జిల్లా బరీషాకు చెందిన మయాంక్ కుందు (23) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఐ ఎకనామిక్స్ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తూ వర్సిటీలోని ఎఫ్ హాస్టల్ రూమ్ నంబర్ 242లో ఎంఏ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ విద్యార్థి సుపత్రి లోహతో కలిసి ఉంటున్నాడు. రీడింగ్ రూమ్లో రెండు ల్యాప్టాప్లను చోరీ చేశారని ఇద్దరు లైఫ్ సైన్స్ విద్యార్థులు ఈ నెల 17న యూనివర్సిటీ యాజమాన్యానికి మయాంక్పై ఫిర్యాదు చేశారు.
ల్యాప్ టాప్లు తీసి ఉంటే తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరారు. ఆ ల్యాప్టాప్ల విష యం తనకు తెలియదని చెప్పాడు. ల్యాప్టాప్లను ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మయాంక్ సోమవారం హాస్ట ల్ నుంచి వెళ్లి వర్సిటీలోని బఫెల్లో లేక్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటికే ఆ విద్యార్థులు మయాంక్పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం మయాంక్ మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించా రు. కాగా డ్రగ్స్కు బానిస అవడంతోనే మయా ంక్ పలుమార్లు ల్యాప్ టాప్లు తస్కరించాడని అతని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.