సిటీబ్యూరో, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లు, జా గ్రత్తలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ ఇతర అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల చెక్ పోస్టులు ఏర్పా టు చేసి, అక్రమంగా తరలించే డబ్బు, మ ద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఇతరత్రా వస్తువులను ఎక్కడికక్కడ కట్టడి చేయాలన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్ధిష్టమైన సూచనలను కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో విధు లు నిర్వర్తించే సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలను కూడా ఏర్పా టు చేసుకోవాలన్నారు. విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. క్రిటికల్ పోలీంగ్ కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేస్తూ, గతంలో ఎన్నికల సందర్భంగా ఎదురైన సమస్యలను గుర్తించి వాటిపై నిఘా పెంచాలన్నా రు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్న వారిని బైండోవర్ చేయాలన్నారు.