హైదరాబాద్ : రూల్స్ ఉల్లంఘిస్తున్న లగ్జరీ కార్ల ఓనర్లకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. కార్లు, బస్సులు, హైఎండ్ వాహనాలపై దృష్టి సారిస్తామని సీపీ స్పష్టం చేశారు. టీఆర్, డార్క్ ఫిల్మ్, రేసింగ్, హెడ్ లైట్, హార్న్ల మార్పు, సైరన్లు, ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు ఉన్న అనధికార వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడతామని.. నంబర్ ప్లేట్ లేని ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ హెచ్చరించారు.