హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఇంటిపై దుండగులు దాడిచేశారు. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అంబర్పేటలోని వీహెచ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఇంటి ముందు నిలిపిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వీహెచ్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల సమస్యలు ఉన్నాయంటే వాటి పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. కారును ధ్వంసం చేసినవారిపై గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.