కవాడిగూడ, ఫిబ్రవరి 4 : లోయర్ ట్యాంక్బండ్లోని రజక అభివృద్ధి సంస్థ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ, సత్యనారాయణలతో కలిసి ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రజక అభివవృద్ధి సంస్థ హాల్ చుట్టు పక్కల గల వీధి వ్యాపారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయడం వల్ల జీహెచ్ఎంసీ డీఈ సన్నీతో మాట్లాడి ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. టీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, జమాలొద్దీన్, వేణు, శంకర్, రాంచందర్, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అప్సా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అప్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ బండమైసమ్మనగర్ కమ్యూనిటీ హాల్లో వివిధ బస్తీలలోని నాలుగు అంగన్వాడీ సెంటర్ల పిల్లలకు సామగ్రిని స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని తెలిపారు. అప్సా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ హజారే మాట్లాడుతూ.. నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 50 బస్తీలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ, శేఖర్, శ్రీనివాస్, అప్సా సమన్వయకర్త బొట్టు రమేశ్, శ్రావణి, అంగన్వాడీ టీచర్స్, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ పద్మ, పుష్పలీల, సరిత, లక్ష్మీనర్సమ్మ, సరస్వతి పాల్గొన్నారు.