శామీర్పేట,నవంబర్1:తెలంగాణ ప్రభుత్వ హయాం లో కులవృత్తులకు పూర్వ వైభవం సంతరించకున్నది. నేడు మత్స్యకారులు, గౌడన్నలేకాదు కులవృత్తుల వారికి ఐదు వేళ్లు నోట్లోకి పోతున్నాయంటే అదే తెలంగాణ ప్రభుత్వ రథసారధి కేసీఆర్ చలువే అంటున్నారు కులవృత్తుల వారు. మిషన్ కాకతీయ, హరితహారానికి తోడు 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ మత్స్యకారుల ను సంపన్నులుగా నిలిపుతుంది.
88 చెరువుల్లో 29 లక్షల చేప పిల్లలు పంపిణీ
ఉమ్మడి శామీర్పేట మండలంలో మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ అనూహ్య ఫలితాలను ఇస్తుంది. గత 3-4 దఫాలుగా వదిలిన చేప విత్తనాలు నేడు మత్స్యకారులకు సిరులను కురిపిస్తున్నాయి. లక్ష్మాపూర్, మల్కచెరువు, బొమ్మరాశిపేట, శామీర్పేట పెద్ద చెరువు వంటి చెరువుల్లో ఇప్పటికే 5 నుంచి 15 కిలోల వరకు ఒక్కోక చేప లభించడం గమనార్హం. శని-ఆదివారాలతో పాటు వారంలో దాదాపు చేపల వేటతో మత్స్యకారులు బిజిగా గడిపేస్తున్నారు. ఈ ఏడు మత్స్యశాఖ ద్వారా శామీర్పేట మండలంలోని 90 చెరువులోకు గాను 87 చెరువుల్లో కట్ల, రవ్వ, బంగారుతీగ వంటి రకాల చేప పిల్లలు 35 నుంచి 40 ఎంఎం సైజ్ పిల్లలను సుమారుగా 23 లక్షల 26 వేలు, కేవలం శామీర్పేట చెరువులోనే కట్ల, రవ్వు, బంగారుతీగ రకాల చేప విత్తనాలు 1800 ఎంఎం సైజ్లో 5 లక్షల 30 వేల పిల్లలను వదిలినట్లు మత్స్యశాఖ అధికారులు రికార్డు చేసుకున్నారు.
మా తలరాతను మార్చేసింది కేసీఆరే..
కులవృత్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది అక్షరాల కేసీఆరే. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదు. చెరువులు, కుంటలు బాగు చేయడంతో పాటు సబ్సిడీపై చేప విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడంతో నేడు చెరువలు జలకళను సంతరించుకున్నాయి. దీనికి తోడు 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ, వాహనాలు, వలలు, బోట్లు, తెప్పలు వంటి పరికరాలు, పనిముట్లు రాయితీపై అందించడం మా జీవితాలనే కాదు తలరాతలను మార్చేసింది.
– యాదగిరి, చైర్మన్ శామీర్పేట చెరువు.