బండ్లగూడ : రాబోయే వర్షకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి,రాజేంద్రనగర్ డివిజన్లలో సివరేజి పైపు లేన్ల నిర్మాణం కోసం రెండు కోట్ల34 లక్షల రూపాయాలు మంజురైనట్లు రాజేంద్రనగర్ జలమండలి అధికారులకు వివరించారు.
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ చేపట్టిన అభివృద్ది పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.వర్షకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకోవలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిధులను మంజురు చేయడం జరిగిందన్నారు.
అనంతరం జాతీయ రోడ్డు రవాణ సంస్థ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్బంగా బెంగుళూర్ హైవే పై జరుగుతున్న నిర్మాణాల గురించి ఆరా తీశారు. రోడ్డు నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతుండంతో వాహనాదారులు,ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.