శ్రీనగర్కాలనీ, ఆగస్టు 27 : శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం శ్రీనగర్కాలనీ లోని ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్రనామార్చన, హోమం, మహాపూర్ణాహుతిలను వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో ఆలయ కమిటీ చైర్మన్ సుజాత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.