మేడ్చల్,మార్చి 30: శ్రీరామ నవమిని పురస్కరించుకుని గురువారం నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, ఏడు మున్సిపాలిటీ, మూడు కార్పోరేషన్లలో ఆలయాలు, వీధుల్లో రాముల వారి కల్యాణాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శాస్ర్తోయుక్తంగా రాములవారితో సీతమ్మ తల్లికి వివాహం జరిపించారు. ఈ కల్యాణోత్సవంలో భక్తు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామ నామ జపం మార్మోగింది. ఈ సందర్భంగా పలు చోట్ల అన్నదానం, శోభయాత్రలను నిర్వహించారు.పానకం, పండ్లు పంపిణీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లక్ష్మీనగర్లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం, నాగారం, ఘట్కేసర్, పోచారం, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లో మంత్రి మల్లారెడ్డి రాముల వారిక కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.