వైభంగా సీతారాముల కల్యాణం
పారవశ్యంలో మునిగితేలిన భక్తులు
చోట్ల అన్నదానాలు నిర్వహణ
సికింద్రాబాద్ జోన్ బృందం, ఏప్రిల్ 10 : శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి. బోయిన్పల్లిలోని దత్తా అంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అదే విధంగా న్యూ బోయిన్పల్లి కంసారి బజార్తో పాటు చిన్నతోకట్ట ప్రాంతంలోని రామాలయంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి రాములవారి కల్యాణంలో పా ల్గొన్న అనంతరం ఆలయంలో పూజలు చేశారు. బాలంరాయిలో జరిగిన సీతారాముల కల్యాణోత్సంలో పాల్గొన్న శ్రీ గణేశ్ఫౌండేషన్ అధినేత శ్రీగణేశ్ పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు