వెంగళరావునగర్, డిసెంబర్ 31 : ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ ఈ ఏడాది రాష్ట్రంలోనే బెస్ట్ నంబర్వన్ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. ప్రతి సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ సారి ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ను ఎంపిక చేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అవార్డును ఇన్స్పెక్టర్ సైదులుకు అందజేశారు. 17 విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకుగానూ ఈ అవార్డు అందజేసినట్లు తెలిపారు. ఉన్నతాధి కారుల ప్రోత్సాహం, తోటి సిబ్బంది సహకారం, ప్రజల తోడ్పాటు తోనే ఈ అవార్డు దక్కిందని ఇన్స్పెక్టర్ సైదులు పేర్కొన్నారు. ఈ అవార్డు బాధ్యతను పెంచిందని, మరింత ఉత్సాహంగా పనిచేస్తామని పేర్కొన్నారు.