వెంగళరావునగర్, జనవరి 6: అభయహస్తం దరఖాస్తులను విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సై శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం.. దాసారం బస్తీలోని ప్రజాపాలన కేంద్రం వద్ద ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న అభయహస్తం దరఖాస్తు పత్రాలను స్థానికుడు పాకాల వెంకటేశ్ గౌడ్.. రూ.50కి ఒకటి చొప్పున విక్రయిస్తున్నట్లు కేంద్రం ఇన్చార్జి, జీహెచ్ఎంసీ ఏఈ సాయి సందీప్ దృష్టికి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.