సికింద్రాబాద్ : విద్యార్థులకు క్రీడలు జీవితంలో భాగం కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల సెమీఫైనల్స్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే అధ్యాపకులు క్రీడలను ప్రొత్సహించాలని సూచించారు. విద్యార్థి దశ పోటీల నుంచి నేడు రాష్ట్రస్థాయి పోటీల వరకు వచ్చిన విద్యార్థులందరినీ అభినందించారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మొదులకుని ఇలాంటి క్రీడలను నిర్వహిస్తున్న జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపుతున్నట్లు చెప్పారు. క్రీడాకారులందరూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ఎదగా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.