బేగంపేట్ జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల పండితులు పూర్ణకుంభంతో మంత్రి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పాడిపంటలతో, ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రభుత్వం దశల వారీగ లక్ష 20 వేలు ఉద్యోగాల భర్తీ చేస్తుందని నిరుద్యోగ యువతకు నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు.
మంత్రి వెంట మాజీ కార్పొరేటర్లు, శేషుకుమారి, అరుణగౌడ్, కిరణ్మయి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్,ఈవో గుత్తా మనోహర్రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్గౌడ్, ఆనంద్పాటిల్, మహేశ్యాదవ్,చందు తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
అమీర్పేట్, జనవరి 1 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం పాలక మండలి మాజీ సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో రూపొందించిన ఎల్లమ్మ అమ్మవారి వార్షిక క్యాలెండర్ను సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆవిష్కరించారు.