ముషీరాబాద్, జనవరి 1: దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి జాతీయ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు. ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఆయన దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
నూతన సంవత్సరంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సుచిర్, సుధీర్, రాయుడు తదితరులు పాల్గొన్నారు.