MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. రద్దయిన రైళ్లలో లింగంపల్లి-ఉందానగర్ (47213), ఉందానగర్-లింగంపల్లి (47211), లింగంపల్లి ఉందానగర్ (47212), ఉందానగర్-సికింద్రాబాద్ (47246), సికింద్రాబాద్-ఉందానగర్ (47247), ఉందానగర్-సికింద్రాబాద్ (47248), ఉందానగర్- సికింద్రాబాద్ (47248), సికింద్రాబాద్-ఉందానగర్ (47249), ఉందానగర్-లింగంపల్లి (47160), లింగంపల్లి-ఫలక్నుమా (47188), ఫలక్నుమా-లింగంపల్లి (47167), లింగంపల్లి – ఉందానగర్ (47194), లింగంపల్లి – ఉందానగర్ (47173) రైళ్లను రద్దు చేసినట్లు చెప్పింది. వీటితో పాటు రామచంద్రపురం – ఫలక్నుమా, మేడ్చల్ – సికింద్రాబాద్, ఫలక్నుమా – హైదరాబాద్, ఫలక్నుమా – హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి తదితర రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.