Hyderabad | హైదరాబాద్ : నిత్యం మద్యం తాగి వేధిస్తున్న కుమారుడిని ఓ తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన హయత్నగర్ పరిధిలోని మునగనూరులో చోటు చేసుకుంది.
కుమారుడు వినయ్ కుమార్ గౌడ్ మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా వినయ్ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తండ్రి శ్రీనివాస్గౌడ్పై పారతో దాడి చేసేందుకు వినయ్ యత్నించాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో పారను వదిలేశాడు వినయ్. ప్రాణభయంతో అదే పారతో కుమారుడిపై దాడి చేసి చంపాడు తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.