పీర్జాదిగూడ, జూన్ 7: భార్యతో గొడవపడి అత్తమామలపై ఓ అల్లుడు కత్తితో దాడిచేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బోడుప్పల్ కార్పొరేటర్ పరిధి అన్నపూర్ణ కాలనీ రోడ్డు నంబర్ 2లో ఉంటున్న సూరయ్య , రుక్మిణి దంపతులు.వీరి కూతురు భాగ్యమ్మను రెండు సంవత్సరాల క్రితం పీర్జాది గూడకు చెందిన అనిల్ కుమార్తో వివాహం జరిపించారు. అనిల్ కుమార్ తరుచూ భార్యతో గొడవపెట్టుకోవడంతో వారం క్రితం భాగ్యమ్మ పుట్టింటికి వెళ్లింది. దీంతో అనిల్కుమార్ భార్యను తిరిగి తన ఇంటికి రమ్మరి అడగడం తో ఆమె నిరాకరించడంతో నువ్వు రాకపోతే మీ అమ్మన్నాన్నలను చంపుతా అని బెదిరించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కొపంతో అత్తారింటికి వచ్చిన అనిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త గొంతుకోసి వెంటనే మామతలపై దాడికి పాల్పడి పరారయ్యాడు. అరుపులు విన్న కూతురు. స్థానికులు చికిత్స నిమిత్తం 108లో గాంధీ దవాఖానకు తరలించారు.