వెంగళరావునగర్, జూలై 6 : బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..ఏపీ పశ్చిమగోదావరి జిల్లా మామదూర్కు చెందిన వీర్లపల్లి పవన్(24)నగరంలోని బేగంపేట్లో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తూ ఎల్లారెడ్డిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం బాత్రూమ్కు వెళ్లి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రూమ్ మెట్స్ హాస్టల్ సిబ్బందికి చెప్పారు.
బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా.. ఎగ్జాస్ట్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. అతని సెల్ఫోన్ పరిశీలించగా.. బెట్టింగ్ యాప్లు లోన్ యాప్ల మెసేజ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలే అతని అప్పులను తండ్రి చెల్లించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.