సుల్తాన్బజార్ : సామాజిక, వైజ్ఞానిక అంశాలపై నిర్వహించే సదస్సులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్,పీజీ సైఫాబాద్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జే లక్ష్మణ్నాయక్ పేర్కొన్నారు.ఈ మేరకు సోమవా రం కళాశాలలో వనరుల సుస్థిర అభివృద్ధి భూ వైజ్ఞానిక శాస్త్ర అధ్యయనాల పాత్ర అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఓయూ వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్లా నాయక్, ప్రొఫెసర్ జీ. మల్లేషం, ప్రొఫెసర్ ఏ బాలకిషన్తో కలిసి ఆయన జ్యోతి ప్రజల్వన చేసి సదస్సును ప్రారంభించారు.అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, ఇలాంటి సదస్సులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో నేర్చు కోవచ్చన్నారు.
ఇటువంటి సదస్సులను భవిష్యత్లో మరిన్ని నిర్వహించేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఎన్జీఆర్ఐ డాక్టర్ చెట్టి,జీఎస్ఐ డాక్టర్ వీవీ శేష సాయి,ఏఎండి డాక్టర్ నాగేంద్రబాబు,సిజీడబ్ల్యూబి డాక్టర్ సుగ్రీవ రెడ్డిలు విద్యార్థులకు సదస్సులో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సి పాల్ డాక్టర్ లక్ష్మీ భవాని, సదస్సు డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి,ఐక్యూఏసీ డైరెక్టర్ ఎం శ్రీనివాస్,డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు,డాక్టర్ బి శంకర్,డాక్టర్ వి రమేష్,డాక్టర్ ఎస్ యాదయ్య,ఎస్ అమరేందర్, తిరుపతి,రాము, రవికాంత్,అక్రంలతో పాటు కళాశాల భోధన,భోదనేతర సిబ్బందితో పాటు 200 మంది పీజీ,యూజీ విద్యార్థు లతో పాటు 150 మంది పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.