ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటూ బాలికలను మాత్రమే టార్గెట్ చేస్తాడు. వారితో చాటింగ్లో ముచ్చ ట్లు పెట్టి ముగ్గులోకి దింపి.. అశ్లీల మాటలతో పలకరిస్తాడు. ఈ విషయాలన్నింటినీ రికార్డు చేసి పెట్టుకుంటా డు.. ఆ తర్వాత లైంగిక వాంఛ తీర్చమంటాడు.. నిరాకరిస్తే చాటింగ్తో పాటు ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటాడు.. అలా చేయొద్దంటే డబ్బు లు డిమాండ్ చేస్తాడు. ఇవ్వకుంటే వేధింపులకు పాల్పడుతాడు. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్న 19 ఏండ్ల ఇంటర్మీడియట్ విద్యార్థినిని హయత్నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, చెట్టెంపహాడ్ గ్రామానికి చెందిన బచ్చబోయిన సాయికుమార్ ప్రస్తుతం వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. అతడికి ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్, ఇతర యాప్ల్లో చాటింగ్ చేయడం అలవాటు. అయితే ఈ చాటింగ్లను కూడా మైనర్ బాలికలను ఎంచుకుని చాట్ చేస్తుంటాడు. ఇలా.. ఓ 10వ తరగతి విద్యార్థిని వెంటపడి ఆమెను ప్రేమంటూ వేధించి వెంటపడ్డాడు. చివరకు ట్రాప్లోకి తెచ్చుకున్న తర్వాత బాలికతో కలిసి తిరిగాడు. ఆ సందర్భంగా దిగిన ఫొటోలను భద్రపర్చుకుని.. వాటి ద్వారా బ్లాక్మెయిల్కు పాల్పడి.. బాలిక నుంచి రూ.65 వేలు వసూలు చేశాడు. ఆ తర్వాత ప్రేమించమని వెంటపడ్డాడు. లేదంటే ఆ ఫొటోలను సోషల్మీడియాలో పెడతానని హెచ్చరించాడు. భయాందోళనకు గురైన ఆ విద్యార్థిని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సాయికుమార్ అలియాస్ సాయివర్ధన్ యాదవ్ను అరెస్ట్ చేశారు.