-1614 గ్రాముల బంగారం స్వాధీనం…
సిటీబ్యూరో : దుబాయ్ నుంచి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణీకురాలిని శంషాబాద్ విమానా శ్రయం కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఎమిరెట్స్ విమానం ఈకే-526 విమానంలో వచ్చిన ప్రయాణీకురాలు లోదుస్తుల్లో బంగారాన్ని పేస్టుగా మార్చి తీసుకువచ్చింది.
ఈ సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని 1614 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 86.42 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారం స్మగ్లింగ్ దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు చెప్పారు.