గాలిలో తేలియాడడం, ప్రయాణించడం ఎప్పుడూ ఓ కొత్త అనుభూతినిస్తుంది. అలాగే గాలిలో సైకిల్పై సవారీ చేయడం కూడా అంతకన్నా చక్కటి అనుభవాన్ని మిగులుస్తుంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ప్లాజా వద్ద ఇలా తీగలపై సవారీ చేసే స్కై సైక్లింగ్, జిప్లైన్ స్పోర్ట్స్కు ఇటీవలే ఆదరణ పెరుగుతున్నది. తొమ్మిదేండ్ల వయస్సు పై బడి 90 కిలోల లోపు బరువు ఉన్న వారు మాత్రమే ఈ సైక్లింగ్కు అర్హులు. స్కై సైక్లింగ్కు రూ.200, జిప్లైన్కు రూ.150 తీసుకుంటున్నారు.