ఉప్పల్ జోన్ బృందం, ఆగస్టు 31: అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ వేడుకలను గురువారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఓల్డ్ కాప్రాలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.బీఆర్ఎస్ కార్యాలయంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు తరలివచ్చి ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని, సోదరభావాన్ని చాటారు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ మా ట్లాడుతూ.. రక్షాబంధన్ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రేమాను రాగాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ సోదరభావాన్ని కలిగి ఉండాలనేది రక్షాబంధన్ ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కా ర్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, మహిళలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి నివాసంలోని కార్యాల యం లో పలువురు మహిళలు ఆయనకు బొట్టుపెట్టి, మంగళహారతులు ఇచ్చి రాఖీలు కట్టారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో యాద మ్మ, భాగ్యలక్ష్మి, మహబూబీ, శ్యామల, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. అలాగే..రామంతాపూర్లోని వెంకట్నగర్కు చెందిన యాదమ్మ, భాగ్య లక్ష్మి, ధనలక్ష్మి, మహబూబి, శ్యామల, తదితరులు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి రాఖీ కట్టారు.
హెచ్బీకాలనీ, మల్లాపూర్ డివిజన్లలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్బీకాలనీ కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్కు ఆయన సోదరి, మల్లాపూర్ డివిజన్ వార్డు కార్యాల యంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డికి స్థానిక మహిళా నాయకురాళ్లు, జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు రాఖీలు కట్టారు.