ముషీరాబాద్, జూన్ 13: వంశీ ఆర్ట్ థియేటర్స్, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సినారె వంశీ శుభోదయం జీవన సాఫల్య జాతీయ సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్రకు సినారె జీవన సాఫల్య సాహితీ పురస్కారాన్ని అందజేశారు. అంతకుముందు లలితా శివజ్యోతి ఫిలిమ్స్ రహస్యం చలన చిత్ర సంగీత విశ్లేషణ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
అదేవిధంగా.. సినారె గీత రాగిణి సీడీని కవి సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శుభోదయం గ్రూప్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ కలపటపు, రహస్యం గ్రంథ రచయిత ఎస్వీ. రమణమూర్తి, డాక్టర్ కేవీ. రావు, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, వంశీ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు, అధ్యక్షురాలు తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజ, కన్వీనర్ ప్రసన్నలక్ష్మీ, రాధిక తదితరులు పాల్గొన్నారు.