మల్లాపూర్, మే 26 : హెచ్బీకాలనీ డివిజన్ మంగపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వెండి కిరీటాన్ని కె. శ్రీనివాస్జ్యోతి దంపతులు సమర్పించారు. శుక్రవారం స్వామివారికి 2 కిలోల 350 గ్రాముల వెండి కిరీటాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేసి తమ మొక్కును తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఈఓ వెంకన్నగౌడ్, శోభారాణి, బుచ్చయ్య, పి. మల్లేశ్గౌడ్, సమ్మని మురళీచారి, భాస్కర్, విక్రమ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.