సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యల పరంపర కొనసాగుతున్నది.
ఫలక్నుమా సర్కిల్లో నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండా దాదాపు 80 సర్టిఫికెట్లు జారీ అయినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు 24 సర్టిఫికెట్లు నిబంధనలకు విరుద్ధంగా జారీ అయినట్లు గుర్తించారు.
ఇందులో భాగంగానే సర్కిల్లో సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా శుక్రవారం రిజిస్ట్రార్, ఏఎంసీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని 31 సర్కిళ్లలో విచారణ జరుగుతున్నది.