మణికొండ : టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్రీడలో అత్యంత నైపుణ్యతను కనబర్చి దేశానికి కాంస్య పతకాన్ని అందించిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధూను ఆదివారం ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, సినీ నటుడు శివారెడ్డి ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్లో కాంస్యపతకాన్ని సాధించిన ఆయిల్పేయింట్ చిత్రపటాన్ని బహుకరించి అభినందించారు.
ఈ సందర్బంగా టోక్యో ఒలింపిక్స్లో జరుగుతున్న ప్రపంచ క్రీడలపై శివారెడ్డి ఆమెతో చర్చించినట్లు తెలిపారు. దేశం కోసం అహార్నిశలు శ్రమిస్తున్న పీవీ సింధూ అందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నారని శివారెడ్డి అన్నారు. సింధూను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేటి యువతకు పీవీ సింధూ ఆదర్శమన్నారు. పట్టుదలతో ముందుకు సాగుతున్న ఆమెకు దేవుడు ఉజ్వళ భవిష్యత్తును అందించాలని అభిప్రాయపడ్డారు.