శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్దికి శాయశక్తుల కృషి చేస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబేకాలనీలో రూః 62 లక్షల వ్యయంతో భూగర్బ డ్రైనేజీ పనులకు ఆయన స్థానికి కార్పొరేటర్ రాగం నాగేందర్యాదవ్తో కలిసి శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా దూబేకాలనీలో పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కరానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. త్వరితగతిన యూజీడీ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ రాజీపడకుండా పనులు పూర్తిచేయాలని సంబందిత అధికారులకు అదేశించారు.
నియోజకవర్గంలో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యలను తెలుసుకుంటు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలిపారు.
శేరిలింగంపల్లిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిజీఏం నారాయణ, మేనేజర్ యాదయ్య, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ నాయకులు మారబోయిన రాజుయాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, కృష్ణ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, నట్రాజ్, రమేష్, రమణ, శ్రీకళ, అరుణ, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.