శంషాబాద్, ఆగస్టు 24: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రోజు రోజుకూ క్రమక్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అదే క్రమంలో విమాన ప్రయాణాల డిమాండ్ పెరుగుతోంది. ఎయిర్పోర్టులో పరిశుభ్రతా చర్యలు, భద్రతా ప్రమాణాలు, డిజిటలైజేషన్తో ప్రయాణికుల్లో విశ్వసనీయత పెరుగుతుంది. గత జూన్ 1న కేవలం 100 విమానాల రాకపోకలు జరగగా, జూలై 25 నాటికి 288కి పెరిగింది. నెల మొత్తంలో 8000 వేల కంటే ఎక్కువే విమానాలు రాకపోకలు జరిగినవి. జూన్ 1న కేవలం 10 వేల ప్రయాణికుల నుంచి జూలై 18న ఒక్క రోజే 29 వేలు దాటింది. అదే నెలలో 6.8 లక్షల మంది దేశీయ, 50,000 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులు రాకపోకలు చేశారు. ఇటీవల శ్రీనగర్కు కొత్తగా విమానాలు నడుస్తుండగా రెండు రోజుల కిందట మాలెకు పునః ప్రారంభమయ్యాయి.