సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ఎండాకాలం నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్టాపులు లేనిచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 20 బస్టాపుల్లో చలువ పందిళ్లు వేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్ద టెంట్లు కూడా వేస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం బస్టాపులు లేవని గుర్తించామని, అక్కడ నీడ కోసం ఏర్పాట్లు చేశామని, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. కూకట్పల్లి, ఎల్బీనగర్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశామన్నారు.