సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయింది.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్టం 30.2, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 32 శాతంగా నమోదయ్యింది. ఎలాంటి వర్ష సూచనలు లేవని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.