శేరిలింగంపల్లి ( హైదరాబాద్ ) : శేరిలింగంపల్లి (Serilingampally) నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi ) అన్నారు. గురువారం కొండాపూర్ సెంట్రల్ పార్క్ ఫేజ్-2 కాలనీలో నూతనంగా కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్డును స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యతలో రాజీపడకుండా అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సెంట్రల్ పార్క్ ఫేజ్-2 కాలనీని అభివృద్దికి కట్టుబడి ఉన్నానని, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, రామకృష్ణరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.