కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 26 : జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఐపీఆర్) సెల్ ఆధ్వర్యంలో వర్సిటీ గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాలులో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంశంపై ఒక రోజు సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వర్సిటీ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, టీఎస్సీవోఎస్టీ రాధాకృష్ణ, మహేంద్ర యూనివర్సిటీ డీన్ వి.బాలకృష్ణ రెడ్డి, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, వర్సిటీ ఐపీఆర్ సెల్ నోడల్ ఆఫీసర్ సురేశ్కుమార్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ చాలెంజస్, ఐపీఆర్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ అకడమిక్ పేటెంట్స్, పేటెంట్ డిఫరింగ్, ఫిల్లింగ్ అండ్ మేనేజ్మెంట్ అన్న అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.