సిటీబ్యూరో: టీ కొట్టులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్లోని పోస్టాఫీస్ ప్రాంతంలో ఉన్న టీ దుకాణంలో హెల్పర్గా పనిచేస్తున్న ఉద్యానాథ్ రూ.500 ఒక ప్యాకెట్ చొప్పున గంజాయి విక్రయిస్తున్నాడు. ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు శుక్రవారం టీ కొట్టుపై దాడి చేసి, నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.