సిటీబ్యూరో, మే 26(నమస్తేతెలంగాణ): నగరంలో మరో సెల్ఫీ పాయింట్ వచ్చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని పదో నంబర్ ప్లాట్ ఫాం వద్ద ‘ఐ లవ్ సికింద్రాబాద్’ పేరిట ఆకృతిని ఏర్పాటు చేశారు.
ఇది ప్రయాణికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ ఐకానిక్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ.. మురిసిపోతున్నారు ఔత్సాహికులు.