మేడ్చల్, సెప్టెంబర్8(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 21న డబుల్ బెడ్రూమ్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వివరించారు. గృహలక్ష్మి పథకం ద్వారా త్వరలోనే ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.