సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ రీసెర్చ్ స్కాలర్ ప్రత్యూష స్టూడెంట్ స్కాలర్షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన 48వ ఇండియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్ వార్షిక సదస్సులో బహుమతిని అందజేశారు. భారతదేశం జనాభాలో జీవ వైవిధ్యం- ప్రభావంపై ఆమె చేసిన అధ్యయానికి ఈ అవార్డు లభించింది.