శంషాబాద్ రూరల్ : దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా అతడి వద్ద నుంచి భారీ ఎత్తున సిగరేట్లు పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న సిగరేట్ల విలువ 9లక్షల72వేల విలువ ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.