శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి
పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
రామచంద్రాపురం,ఏప్రిల్ 16: తెలుగు ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లే విధంగా హనుమంతుడు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని ఇవ్వాలని శ్రీ గురు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని బీడీఎల్ కాలనీ సమీపంలో స్వామీజీ నిర్మించిన గణపతి రాజరాజేశ్వరి జయలక్ష్మి మాత దత్తాత్రేయ సహిత పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్ పాల్గొన్నారు.
సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. అలాగే కుంబాభిషేకం, గోపురం పూజలను నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రెండెకరాల స్థలంలో రూ.7కోట్లతో పెద్ద ఎత్తున పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కార్పొరేటర్లు స్వామి దీవెనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపురం డివిజన్ అధ్యక్షుడు గోవింద్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు విజయ్, మల్లేశ్, కృష్ణకాంత్, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.