సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : నర్సాపూర్-ఔరంగాబాద్, గుంటూరు-ఆదిలాబాద్ స్టేషన్ల మధ్య రెండు వన్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శనివారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న ఈ రెండు రైళ్లు నడుస్తాయన్నారు. ధన్బాద్-చెన్నై రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
ఈ నెల 27న ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.