సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తన వంతు బాధ్యతగా భారతీయ స్టేట్ బ్యాంక్ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొవిడ్ చికిత్స పొందుతున్న రోగులకు అందజేశారు. ఐదు లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ యంత్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటిని రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్, స్పర్శ్ హోస్పీ, సెంటర్ ఆఫ్ పలియేటివ్ కేర్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జి.రామకృష్ణ తెలిపారు. అదే విధంగా బ్యాంకు తరపున కొవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. వీటిని యూసుఫ్గూడ, రహ్మత్నగర్, కృష్ణానగర్, లక్ష్మీనగర్, ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట, శ్రీనగర్, మన్సూరాబాద్ ప్రాంతాల్లో ఎన్జీల ద్వారా అందజేస్తున్నామని తెలిపారు.
ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మిశ్రా నేతృత్వంలో కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమాలను చేపట్టామన్నారు. కొవిడ్ బాధితులకు సేవలను అందిస్తున్న సంస్థలను గుర్తించి వారికి మరింత సహకారం బ్యాంకు నుంచి అందేలా చేస్తున్నామన్నారు. ఇటీవల విద్యానగర్లోని ఆంధ్ర మహిళా సభలో కొవిడ్-19 కేర్ సెంటర్ను 35 బెడ్లతో ఏర్పాటు చేశామన్నారు. ఇవే కాకుండా లైఫ్ సేవింగ్ హెల్త్ కేర్ పరికరాలను, ఆహార పదార్థాలను అందిస్తూ వస్తున్నాం. అదే విధంగా గతంలో నారాయణ పేట్, గద్వాల్, వికారాబాద్ జిల్లాలకు ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల చొప్పున మొత్తం 15 అందించామని చెప్పారు. బ్యాంకు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల విలువైన వస్తువులను అందజేశామన్నారు. జనరల్ మేనేజర్ జోగేష్ చంద్ర సాహు మాట్లాడుతూ తాము చేస్తున్న సహాయానికి పలు స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో ఉందన్నారు.
సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ భయాందోళనకు గురి చేస్తుంది. అందులో భాగంగానే కొవిడ్తో పోరాడేలా ప్రోత్సహించేందుకు ఫ్రీడమ్ కుకింగ్ ఆయిల్స్ (జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్రతిష్టాత్మక బ్రాండ్) ‘బీ ఏ కొవిడ్ ఫ్రీడమ్ ఫైటర్’ అనే కార్యక్రమం ప్రారంభించింది. ప్రజలు సానుకూల దృక్పథంతో ఉండేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. అందులో భాగంగానే స్ఫూర్తిదాయకమైన వీడియోలను రూపొందించింది. భౌతిక దూరం పాటించడం, ధైర్యం, ఒకరికి ఒకరూ తోడుగా నిలిస్తేనే వైరస్ను ఎదుర్కోగలమని సూచించింది. ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని, ఇంట్లోనే పరిస్థితిని చక్కదిద్దుకునేలా వీడియోల ద్వారా అవగాహన కల్పించింది.
ఈ సందర్భంగా ఫ్రీడం హెల్తీ కుకింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ‘బీ ఏ కొవిడ్ ఫ్రీడమ్ ఫైటర్’ ప్రచారాన్ని ప్రారంభించామని చెప్పారు. ప్రజలకు స్ఫూర్తి కలిగించేలా వీడియోలు రూపొందించామన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఫ్రీడమ్ కుకింగ్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే 200 పడకల ఐసొలేషన్ కేంద్రాన్ని ఉప్పల్లో ప్రారంభించామని తెలిపారు. గత ఏడాది 2.5 కోట్ల రూపాయలను కొవిడ్ ఉపశమన కార్యక్రమాలకు అందజేశామని గుర్తు చేశారు. వీటితో పాటు చాలా మందికి ఆహారం కూడా అందించామని చెప్పారు.