కాలేరు వెంకటేశ్
అంబర్పేట, జూలై 6 : నల్లకుంట డివిజన్ సత్యానగర్లో దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. డ్రైనేజీ, వరదనీటి నాలాలో కలువడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నదని చెప్పారు. బుధవారం జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సత్యానగర్లో పర్యటించారు. చాలాకాలంగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యను బస్తీవాసులంతా ఎమ్మెల్యేకు వివరించారు. వానాకాలంలో భారీ వర్షాలు పడినప్పుడు డ్రైనేజీ, వరదనీరు రెండు కలిసిపోవడంతో ఆ నీరంతా ఇండ్లలోకి వస్తుందని అన్నారు. రెండు, మూడు రోజులు మురుగునీటిలోనే ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉంటుందని తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే బస్తీలోనెలకొన్న డ్రైనేజీ సమస్యపై పూర్తి అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. చిన్న చిన్న గల్లీలు ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని, బస్తీ ప్రజల బాధను అర్థం చేసుకుని సత్యానగర్లో డ్రైనేజీ, వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమగ్రంగా అధ్యయనం చేసి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తే, నిధులు మంజూరు చేయిస్తానని అ న్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, నాయకులు కూర నరేందర్, రాముయాదవ్, శ్రీనివాస్రెడ్డి, ధన్రాజ్యాదవ్, బొజ్జ రాజు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
దళితబంధులో దళారులను నమ్మొద్దు ..
దళితబంధు పథకం అమలులో దరఖాస్తుదారులు దళారులను నమ్మొద్దని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గోల్నాక డివిజన్ కామ్గార్నగర్కు చెందిన రాజేశ్ ఫొటోస్టూడియో నిమిత్తం దరఖాస్తు చేసుకోగా అతనికి కెమెరా తదితర సామగ్రి దళితబంధు పథకంలో మంజూరైంది. అట్టి సామగ్రిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బుధవారం రాజేశ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకుంటున్న వ్యక్తులు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వొద్దని చెప్పారు. ఎవరైనా అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హులైన వారందరికీ పథకం అందేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మంచి ప్రాజెక్టును ఎన్నుకొని దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.