ఎల్బీనగర్ : బోనాల పండుగ, వర్షాకాలం నేపథ్యంలో సరూర్ నగర్ సర్కిల్ ఉప కమీషనర్ సుజాత స్థానిక అధికారులతో సమావేశం నిర్వాహించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను ఇటీవల జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యం, బోనాలు పండుగను పురస్కరించుకుని బుధవారం సర్కిల్ కార్యాలయంలో కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ, హైడ్రా, టీఎస్ఎస్పీడీసీఎల్, వాటర్ వర్క్స్, పోలీస్, హెల్త్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వర్షాకాలంలో నాలాల పూడిక తీయడం, భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వర్షపు నీరు ప్రవహించడానికి అడ్డంకులు తొలగించడం, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను వెంటవెంటనే క్లియర్ చేయడం, పడిపోయిన చెట్లను వెంటనే తొలగించడం లాంటి పనులను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి , రాధా వీరన్నగారి, పవన్ కుమార్ నాయికోటి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు విజయ్ కుమార్, నవీన్ కుమార్, కవిత, శానిటేషన్ డిఈ చందన చౌహన్, పోలీస్ ఇన్స్పెక్టర్లు వీ సైదిరెడ్డి, జి వెంకటేశ్వర్ రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు / ఇంజనీర్లు, హైడ్రా, అగ్నిమాపక శాఖ, టీఎస్ఎస్పీడీసీఎల్, వాటర్ వర్క్స్, పోలీస్, హెల్త్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.