హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాడుకుంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసిన వెంటనే శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారారన్నారు. వివేకా హత్యకేసులో అవినాష్రెడ్డికి బెయిల్ రావడం వంటిది క్విడ్ ప్రోకో మాదిరిగా ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకొని హైదరాబాద్ మగ్దూం భవన్ శుక్రవారం నారాయణ జాతీయ జెండాను ఆవిషరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.టి. నరసింహ అధ్యక్షత వహించగా, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, వి.ఎస్.బోస్, పశ్య పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రపతిగా ఉన్న ఆదివాసీ గిరిజన మహిళను పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గోలొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారని, తెలంగాణ విషయంలో బీజేపీ,కాంగ్రెస్, టీడీపీ కూడా అటు ఇటు అనే ఆట అడాయని నారాయణ విమర్శించారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఒకే మాటా వినిపించామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోరాటంలో సీపీఐకి సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, పల్లె నర్సింహ, ఏఐటీయుసీ నాయకులు పి.ప్రేమ్ పావని, బి.వెంకటేశం, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, నాయకులు ఆది రెడ్డి, స్టాలిన్, కమతం యాదగరి, శేఖర్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, పడాల నళిని, నెర్లేకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీ ఉల్లాఖాద్రీ, కె.ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.