ఘట్కేసర్,ఏప్రిల్27: పోచారం మున్సిపాలిటీ సంస్కృ తి టౌన్షిప్ అభివృద్ధికి ప్రభుత్వ చేయూ తనిస్తున్నది. సొసైటీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధ్దికి తోడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో మరింత అభివృద్ధి జరు గుతున్నది. 2080 ప్లాట్లు ఉన్న ఈ టౌన్షిప్లో 64 బ్లాక్లతో పది,నాలుగు ప్లోర్లలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు.ప్రస్తుతం ఇక్కడి పదివేల జనాభా నివసిస్తుంది.టౌన్షిప్ ఏర్పాటు అనంతరం కేవలం టౌన్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగినప్పటికీ,టౌన్షిప్ను మున్సిపాలిటీలో 12వ వార్డు గా గుర్తించడంతో టౌన్షిప్లో రోడ్లు, వీధిదీపాలు,పరిశుభ్రత,పచ్చదనం, ఓపెన్ జిమ్, వంటి పనులు జరిగాయి.
రూ.30లక్షలతో మహిళా,చిల్డ్రన్ పార్కు అభివృద్ధి
సంస్కృతి టౌన్షిప్ ప్రజల కోసం మున్సిపాలిటీ నిధు లు రూ.30లక్షలతో మహిళ,చిల్డ్రన్ పార్కును అభివృద్ధి చేశారు.మరో రూ.60లక్షలతో టౌన్షిప్లో దుకాణ సముదాయం నిర్మించాలని ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి టౌన్షిప్ అసోసియేషన్ ప్రతిపాదనలు పెట్టింది. మున్సిపాలిటీ నిధులు రూ.5లక్షలతో ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు.రూ.30లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి టౌన్షిప్ అసోసియేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో టౌన్షిప్ అభివృద్ధి
పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్ ప్రభు త్వ, మున్సిపాలిటీ నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి అవుతున్నది. ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చిం చి రోడ్లు,పరిశుభ్రత, వీధిదీపాలు,పచ్చదనాన్ని పెం పొందిస్తుంది.కమ్యూనిటీ హాల్,చిల్ట్రన్ పార్కు,షాపింగ్ కాప్లెక్స్ వంటి పనులు జరుగాల్సి ఉంది. ఇందుకోసం టౌన్షిప్ నుంచి ప్రభుత్వానికి,మున్సిపాలిటీకి ప్రతిపాదనలు పంపాం.
-బి.హరిప్రసాద్రావు,టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు